
చిలుకూరి నారాయణరావు
ఈరోజు మనం తెలుగు భాషా, సాహిత్య, చారిత్రక రంగాలలో చెరగని ముద్ర వేసిన ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయనే మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారు.
1890లో శ్రీకాకుళం జిల్లా, పొందూరు గ్రామంలో భీమసేనరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన నారాయణరావు గారు, సుప్రసిద్ధ చరిత్రకారులుగా, పరిశోధకులుగా పేరుగాంచారు. డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు.
ఆయన ఎంతటి రచనా పిపాసో ఊహించండి! మొత్తం 240 గ్రంథాలు రచించారు. వాటిలో ‘ఆంధ్ర భాషా చరిత్రం’, ‘శబ్దార్థ చంద్రిక’ వంటి భాషా శాస్త్ర గ్రంథాలు, ‘మొండి శిఖండి’ అనే నాటకం వంటివి కొన్ని ముఖ్యమైనవి. అయితే, ఆశ్చర్యకరంగా, ఆయన రాసినవన్నీ అచ్చు భాగ్యానికి నోచుకోలేదు. వాటినన్నిటినీ ప్రచురించి ఉంటే, అదొక మహా సారస్వత రాశి అయి ఉండేదని అంటారు. చివరికి అయన ఛాయగలిగింది ఒక్కటే ఒక పరిచయ పత్రమైనా అచ్చు వేయించగలిగారు.
నారాయణరావు గారి ప్రజ్ఞ కేవలం రచనా రంగానికే పరిమితం కాలేదు. ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త కూడా. ముఖ్యంగా ‘ఆంధ్ర భాషా చరిత్రం’ అనే బృహత్ గ్రంథంలో, తెలుగు భాషకు సంస్కృత, ప్రాకృత భాషలతో ఉన్న సంబంధాన్ని గూర్చి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాల్డ్వెల్(Robert Caldwell) వంటి పండితుల ద్రావిడ భాషా సిద్ధాంతాలను కూడా ఆయన గట్టిగా సవాలు చేశారు.
ఇంకో విషయం గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి అదే అయన ‘జ్ఞాపకశక్తి’. ఆయన్ని అప్పట్లోనే ‘ఏకసంధాగ్రాహి’ అనేవారు – అంటే, ఒకసారి విన్నా, చదివినా వెంటనే గ్రహించి, గుర్తుంచుకోగల ప్రతిభావంతుడు. పర్లాకిమిడి కళాశాలలో చదువుకునే రోజుల్లో, గిడుగు రామమూర్తి పంతులు గారు ఒక కవి రాసిన సానెట్ను చదివి, ఎవరైనా దాన్ని ధారణ చేయగలరా అని అడిగితే, నారాయణరావు గారు ‘ఇంకోసారి చదవండి, నేను చెప్తాను’ అన్నారట! ఇది ఆయన అపారమైన మేధాశక్తికి నిదర్శనం. అయన చదవగా తు.చ. తప్పకుండ తిరిగి చదివారు కూడా, గంటల తరబడి ఇంగ్లీషు పోయెట్రీ కూడా కంఠస్థంగా చెప్పగల సామర్థ్యం ఆయనది.
అది ఒక్కటేనా !! ఆయన గుజరాతీ భాషా నేర్చుకొని గుజరాతీ భాషా సాహిత్య చరిత్రను రచించారు. జపనీస్ భాషను నేర్చుకొని, జపాన్ దేశ చరిత్ర రచించారు. ఉపనిషత్తులను, గీతాసారాన్ని సరళంగా. బిల్ ఖురాన్ను త్రిపీటకలుగా , ఆఖరికి పార్శి వాళ్ళ జెండా అవెస్తను కూడా తెలుగు లో అనువదించారు. 1933లో నవ్యసాహిత్య పరిషత్తుకు తొలి అధ్యక్షులుగా వ్యవహరించారు. దీర్ఘకాలం రాజమహేంద్రవరం, అనంతపురం కళాశాలల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.
తెలుగులో తొలిసారి పరిశోధనలో డాక్టరేట్ పొందిన వ్యక్తి చిలుకూరి నారాయణరావు గారు.ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. ఆ బిరుదుకే ఆయన వల్ల సార్థకత చేకూరిందని అంటారు.
మీకు ఇంకో విషయం తెల్సా ?! నేడు మనం వాడుతున్న ‘రాయలసీమ’ అనే పదాన్ని, పూర్వం ‘దత్తమండలాలు’గా పిలవబడే ప్రాంతానికి ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా నారాయణరావు గారే.
తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల, చరిత్ర పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయన చేసిన కృషి, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు (సహకారం లోపించడం, అసూయ వంటివి), ఆయన బహుముఖ ప్రజ్ఞ – ఇవన్నీ చిలుకూరి నారాయణరావు గారిని తెలుగు సాహితీ చరిత్రలో ఒక విశిష్ట స్థానంలో నిలుపుతాయి.
మహామహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా! ఇంకో వ్యాసంలో మరో ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
అంతవరకు సెలవు.
ధన్యవాదాలు!








